టపాసుల షాపుల ఏర్పాటు కోసం స్థల పరిశీలన

Published: Saturday October 15, 2022

మధిర  అక్టోబర్ 14 (ప్రజా పాలన ప్రతినిధి) దీపావళి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేయబోయే బాణాసంచా దుకాణాల కోసం కావలసిన స్థలాన్ని శుక్రవారం మధిర సీఐ మురళి తహసీల్దార్ రాంబాబు కమిషనర్ అంబటి రమాదేవి పరిశీలించారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాణాసంచా దుకాణాలను జనసంచారం లేని విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. పట్టణంలో దుకాణాలన్నిటిని ఒకే చోట ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అధికారులు ఖాళీగా ఉన్న మధిర మార్కెట్ యార్డులోని ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతంలో దుకాణాలు ఏర్పాటు చేయటం వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని, పార్కింగ్ కూడా అనుకూలంగా ఉంటుందని అధికారులు కూడా ఒక అంచనాకి వచ్చినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సతీష్ కుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి రమేష్, ఫైర్,  మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.