దవాఖానాను సందర్శించిన జడ్పీటీసీ దిరిశాల ప్రమీల..

Published: Saturday December 03, 2022
తల్లాడ, డిసెంబర్ 2 (ప్రజాపాలన న్యూస్): 
 తల్లాడ మండలంలోని ముద్దునూరు గ్రామంలో పల్లె దవాఖానాను తల్లాడ జడ్పీటీసీ దిరిశాల ప్రమీల శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రోగులకు ఎలా వైద్య సేవలు అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పల్లెల్లో కూడా దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్యులు అందుబాటులో ఉంటారని, సకాలంలో వైద్య సేవలు పొంది ఉచితంగా  మందులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట టిఆర్ఎస్ పార్టీ జోనల్ చైర్మన్ దిరిశాల దాసురావు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ నాయకులు కట్టమూడి శ్రీనివాసరావు, ఆశ అంగన్వాడి కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.