శాంతి నిలయంలో మానసిక వికలాంగులకు అన్నదానం
Published: Monday September 19, 2022
బోనకల్, సెప్టెంబరు 18 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో నీ శాంతి నిలయంలో ఆశ్రయం పొందుతున్న మానసిక వికలాంగులకు ఆదివారం బ్రహ్మణపల్లి గ్రామానికీ చెందిన పారుపల్లి కోటయ్య జ్ఞాపకార్థం సంధర్భంగా వారి కుమారులు పారుపల్లి జోగారావు,మనవళ్ళు,మనమరాల్లు శాంతి నిలయంలో గల మానసిక వికలాంగుల పిల్లలకు అన్నదానం చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మానసిక వికలాంగుల పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడ్డం చాలా ఆనందంగా ఉందని,మానవసేవే మాధవసేవ అనే దృక్పథంతో ప్రతీ ఒక్కరు సేవభవాన్ని కలిగి మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తు ఈ లాంటి మానసిక వికలాంగులకు అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొంగర జగన్,సేవాలయ నిర్వాహకులు సిస్టర్ ఆల్ఫి పాల్గొన్నారు.
Share this on your social network: