పట్టణాభివృద్ధే ప్రథమ లక్ష్యం
Published: Wednesday August 04, 2021
వికారాబాద్ బ్యూరో 03 ఆగస్ట్ ప్రజాపాలన : వికారాబాద్ మున్సిపల్ పట్టణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ అన్నారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డు లో వార్డు కౌన్సిలర్ మసనగారి మంజుల ముత్యం రెడ్డి ఆధ్వర్యంలో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనైనది. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్పి, ఎల్ఆర్ఎస్ 17 లక్షల నిధులతో సిసి రోడ్లు నిర్మించనున్నామని వివరించారు. ఆర్ అండ్ బి మెయిన్ రోడ్డు నుండి అమానుల్లా ఖాన్ ఇంటి వరకు, మట్టం మంగలి అనంతయ్య ఇంటి నుండి మోనయ్య ఇంటి వరకు, పీర్ల మసీదు నుండి అన్వర్ ఇంటి వరకు, లక్ష్మయ్య ఇంటి నుండి నర్సిములు ఇంటి వరకు సిసి రోడ్లు నిర్మింనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ చిట్యాల అనంతరెడ్డి, శివారెడ్డిపేట్ పిఏసిఎస్ చైర్మన్ మసనగారి ముత్యంరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్ళపల్లి రమేష్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు అఫ్జల్ పాష (షకీల్), డిఈ రామకృష్ణ, ఏఈ రాయుడు, యెన్నపల్లి షఫీ, గోపి, శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Share this on your social network: