హస్నాబాద్ గ్రామానికి చెందిన ఆడపడుచులు కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ..

Published: Wednesday February 02, 2022

జగిత్యాల, ఫిబ్రవరి 01 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల అర్బన్ మండల హస్నాబాద్ గ్రామానికి చెందిన ఇద్దరు ఆడపడుచులు గంగిపెల్లి లక్ష్మి, పట్నం యదవ్వ లకు కల్యాణ లక్ష్మి ద్వారా ఒక్కొక్కరికి 1,00,116 చొప్పున మంజూరైన  చెక్కులను వారి ఇంటికి స్వయంగా వెళ్లి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత అందజేసినారు.  ఆనంతరం ఎమ్మెల్యే, జెడ్పీ చైర్ పర్సన్ అదే గ్రామానికి చెందిన డాన్స్ మాస్టర్ దూడ రాజేష్ జాతీయ స్థాయిలో ఇటీవల అవార్డ్ సాధించగా రాజేష్ ను అభినందించి శాలువాతో సత్కరించినారు. అలాగే గ్రామానికి చెందిన ద్యావనపల్లి సత్యనారాయణ రావు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించినారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేష్, సర్పంచ్ లక్ష్మణ్ రావు, ఎంపీటీసీ మల్లారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లేష్, ఉపాధ్యక్షుడు లింగారెడ్డి, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.