బిజెపికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టాలి -- ముప్పిడి సైదులు గౌడ్

Published: Wednesday September 28, 2022
చౌటుప్పల్, సెప్టెంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి): మునుగోడు లో జరిగే ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీని ఓడించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు ముప్పిడి సైదులు గౌడ్ కోరారు. మండలంలోని జై కేసారం గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో మహిళలపై దాడులు పెరిగాయని అన్నారు. బిజెపి నాయకులే మహిళలను అత్యాచారం చేసి, హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళల పట్ల బిజెపికి చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న బిజెపి పార్టీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేవలం కాంట్రాక్టుల కోసం వెళ్లారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలు బిజెపి పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి ఆకుల ఇంద్రసేనారెడ్డి, నాయకులు బోయ దేవేందర్, అంజిరెడ్డి, మల్కాపురం నరసింహ, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area