మజ్లిస్ పార్టీ అధ్వర్యంలో చలి వేంద్రం ప్రారంభం **

Published: Thursday February 16, 2023
సీఐ రాణా ప్రతాప్ ప్రారంభించారు **
 
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 15 (ప్రజాపాలన, ప్రతినిధి) : వేసవి కాలం సందర్బంగా ప్రజల దాహాన్ని తీర్చేందుకు ఆసిఫాబాద్ ఆర్టీసీ బస్టాండ్, పెట్రోల్ పంప్ సమీపం లోమజ్లిస్ పార్టీ నాయకులు చలివెంద్రం ప్రారంభించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా  ఆసిఫాబాద్ సి ఐ రానా ప్రతాప్ ,ఎస్ ఐ చుంచు గంగన్న  లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు., ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మజ్లిస్ పార్టీ నాయకులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్ననందుకు అభినందించారు.
ఈ కార్యక్రమం లో మజ్లిస్ పార్టీ అధ్యక్షులు ఎం డి సల్మాన్ ఖాన్ , ప్రధానకార్యదర్శి మీర్ కశీఫ్ అలి హష్మీ సహాయ కార్యదర్శి షేక్ అరిఫ్, షకీల్ అహ్మద్, సబ్యులు,అలీ,మొహమ్మద్ పాషా,అయిమన్ అముది,తమిమ్,శాహబాజ్, ఫైసల్, తదితరులు, పాల్గొన్నారు.