విద్యార్థుల ఆత్మవిశ్వాసమే కలల సాధనకు తొలిమెట్టు : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

Published: Tuesday October 18, 2022

ప్రజా పాలన- శేరిలింగంపల్లి/ అక్టోబర్ 17 న్యూస్ :విద్యార్థుల ఆత్మవిశ్వాసమే కలల సాధనకు తొలిమెట్టు అని, మహనీయుల జీవిత చరిత్రలను ఆదర్శంగా తీసుకొని ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని, ప్రభుత్వం కల్పించే వనరులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని జీవితలో ఉన్నత లక్ష్యాలను సాధించి, తల్లిదండ్రుల కలలను సహకారం చేయాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సూచించారు. సోమవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో పెదప్రజల పిల్లలు చదువుకు దూరం కావద్దని ఆరు సంవత్సరాల క్రితం తన సొంత నిధులతో సుమారుగా 50 లక్షల రూపాయలతో సురభికాలనీలో నిర్మించబడిన ప్రభుత్వ ప్రాధమిక ఆంగ్ల మధ్యమ పాఠశాలలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ విద్యార్థులకు స్కూల్ యూనిఫార్మ్స్ ను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకులు బోదిస్తున్న విద్యను చక్కగా అర్ధం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, సమాజంలో ఆదర్శవంతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల చదువు కొరకు తన వంతు కృషి ఎల్లపుడు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటి చైర్మన్ బస్వరాజ్ లింగయ్యత్, ప్రధానోపాధ్యాయులు గంగాధర్, ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు దేవదాసు, అధ్యాపకులు ఆశ్రఫ్, గోపాల్ యాదవ్, పాఠశాల సిబ్బంది, మిడ్ డే మీల్స్ సిబ్బంది, విద్యార్థుల తల్లి తండ్రులు, తదితరులు పాల్గొన్నారు.