ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 21 ప్రజాపాలన ప్రతినిధి *మిగిలి ఉన్న మంచినీటి పైప్ లైన్ పనులను త్వర

Published: Wednesday February 22, 2023

హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్  కళ్లెం నవజీవన్ రెడ్డి   నేడు జలమండలి అధికారులతో కలిసి డివిజన్లోని తిరుమల కాలనీ లో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ప్రస్తుతం కాలనీలో నిలకడగా   జరుగుతున్న పైప్ లైన్ పనుల వల్ల కాలనీ వాసులు ఇబ్బందిగా మారిందని తెలపడంతో  స్పందించిన కార్పొరేటర్  మంచి నిట్టి పైప్ లైన్ పనుల్లో ఎలాంటి అలసత్వం వహించకుండా సాధ్యమైనంత త్వరగా మంచి నిట్టి పైప్ లైన్ పనులు పూర్తి చేయాలని
అధికారులకి తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ రాజు తిరుమల కాలనీ అధ్యక్షులు  వీర స్వామి కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు..