మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Thursday April 28, 2022
బోనకల్, ఏప్రిల్ 27 ప్రజాపాలన ప్రతినిధి : మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండాను టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మోదుగుల నాగేశ్వరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమరుల త్యాగాలు ప్రజల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, తెలంగాణ కోసం కెసిఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టారని, ప్రత్యేక తెలంగాణ తో బడుగు బలహీన వర్గాలకు రైతాంగం తోపాటు అన్ని వర్గాల ప్రయోజనం కలిగిందని తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ నలుదిక్కుల భారతదేశం మొత్తం ఆదర్శమైన రాష్ట్రంగా అభివృద్ధివైపు తీసుకెళ్లి నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, మధిర మార్కెట్ కమిటీ సభ్యులు కొనకంచి నాగరాజు, జానకిపురం గ్రామ సర్పంచ్ చిలక వెంకటేశ్వర్లు, మండల నాయకులు తన్నీరు పుల్లారావు, వెనిగళ్ళ మురళి, ధారగాని నారాయణ ,కొమ్మినేని సత్యనారాయణ, రజక సంఘం జిల్లా అధ్యక్షులు తమ్మారపు బ్రహ్మం, టిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు షేక్ నజీర్, కార్మిక సంఘం మండల అధ్యక్షుడు బంధం నాగేశ్వరావు, సోషల్ మీడియా మండలాధ్యక్షుడు పిల్లల దేవేందర్, మైనార్టీ మండల అధ్యక్షుడు షేక్ ఇబ్రహీం, షేక్ సైదా, షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు.