నిర్లక్ష్యం వీడండి - వరి కొనుగోలు పెంచండి
Published: Saturday May 29, 2021
మల్లాపూర్, మే 28 ప్రజాపాలన ప్రతినిధి : మల్లాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ నిర్లక్ష్యం వలన వరి కొనుగోలు వేగవంతం కావడం లేదని ఒకవైపు ఖరీఫ్ సమయం సమీపిస్తున్నందున వర్షాలతో వరి ధాన్యం తడిసేవీలున్నందున చాలా నష్ట పోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ నిర్లక్ష్యం పైన చర్యలు తీసుకొని వరి కొనుగోలు వేగవంతం చేయాలని శుక్రవారం మల్లాపూర్ మండలంలోని రైతులు తహశీల్దార్ రవీందర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పూoడ్ర శ్రీనివాస్ రెడ్డి, గాండ్ల రాజారెడ్డి, న్యావనంది లింబారెడ్డి, బొల్లే శంకర్, మారుతి, ఎర్ర భూమయ్య, పల్లికొండ రమేష్, పి శ్రీనివాస్, సాగర్, నాగరాజు, ఆకుతోట లస్మయ్య, రాజo, మాట్ల నడిపి గంగారాం, సింగారపు గంగారాం తదితర రైతులు పాల్గొన్నారు.
Share this on your social network: