చింతమనేనిని కలిసిన కూచిపూడి వెంకటేశ్వరరావు..
Published: Monday December 06, 2021
తల్లాడ, డిసెంబర్ 5 (ప్రజాపాలన న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ను తల్లాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు కలిశారు. సత్తుపల్లి మండలంలోని కాకర్లలో ఆదివారం కమ్మవారి వన సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కూచిపూడి వెంకటేశ్వరరావు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్ప గుచ్చం అందించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో తేదేపా చేపట్టనున్న కార్యక్రమాలు గురించి ఇరువురు చర్చించారు. ఆయన వెంట కొమ్మినేని నరసింహారావు ఉన్నారు.
Share this on your social network: