చింతమనేనిని కలిసిన కూచిపూడి వెంకటేశ్వరరావు..

Published: Monday December 06, 2021
తల్లాడ, డిసెంబర్ 5 (ప్రజాపాలన న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ను తల్లాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు కలిశారు. సత్తుపల్లి మండలంలోని కాకర్లలో ఆదివారం కమ్మవారి వన సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కూచిపూడి వెంకటేశ్వరరావు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్ప గుచ్చం అందించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో తేదేపా చేపట్టనున్న కార్యక్రమాలు గురించి ఇరువురు చర్చించారు. ఆయన వెంట కొమ్మినేని నరసింహారావు ఉన్నారు.