హబ్సిగూడ డివిజన్లో సోడియం క్లోరైడ్ పిచికారి

Published: Saturday April 24, 2021
మేడిపల్లి, ఏప్రిల్ 23, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశ ఉధృత నేపథ్యంలో హబ్సిగూడ కార్పొరేటర్ చేతన హరీష్ కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా డివిజన్లోని వీధి నెంబర్ 1, పిఎన్టి కాలనీ, కాకతీయనగర్ తదితర కాలనీలలో పెద్ద ట్యాంకర్తో సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ చేతన హరీష్ స్వయంగా సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. కరోనా వ్యాప్తి నివారించడంలో ప్రజలు భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ విధిగా ముఖాలకు మాస్కులు, సామాజిక దూరం పాటిస్తూ, అవసరమైతేనే బయటికి రావాలని కార్పొరేటర్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి గీత సెల్ కన్వీనర్ రఘుపతి గౌడ్, మరియు సంజయ్ పటేల్, గ్యార రవి, న్యాలకొండ సుమన్ రావు, డివిజన్ ఉపాధ్యక్షులు కుంభం శ్రీనివాస్, డివిజన్ ఓబిసి అధ్యక్షులు అల్కాపూర్ సురేష్, కట్ట భాస్కర్, పాప్ సాయి, చింతల బాబు తదితరులు పాల్గొన్నారుు.