మునుగోడు ఉప ఎన్నికల్లో కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ ఇంటింటా ప్రచారం

Published: Monday October 17, 2022
మేడిపల్లి, అక్టోబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి)
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మునుగోడు నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా చౌటుప్పల్ మండలం రెడ్డి బావి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ, టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను ఓటర్లకు అందజేస్తూ, టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టి శత్రుజ్ఞ, కె చందర్, మేకల వెంకటేష్ ముదిరాజ్, వై శేఖర్ యాదవ్, పి కృష్ణమూర్తి. అభిలాష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.