ఎమ్మెల్యే సండ్రాను సన్మానించిన మువ్వా మురళీ..

Published: Wednesday November 23, 2022

తల్లాడ, నవంబర్ 22 (ప్రజా పాలన న్యూస్): సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్యను టిఆర్ఎస్ నాయకులు మువ్వా మురళి సన్మానించారు. మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రానికి హాజరైన ఎమ్మెల్యేని ఆయన శాలువాలు పూలమాలతో సన్మానించి సత్కరించారు. మువ్వా మురళి ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.  ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కేతినేని చలపతి, గ్రామ సర్పంచ్ తెళ్ళూరి కృష్ణయ్య  పాల్గొన్నారు.