ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
Published: Thursday December 22, 2022
వైఎస్సార్ టిపి జిల్లా అధికార ప్రతినిధి కావలి వసంత్ కుమార్
వికారాబాద్ బ్యూరో 21 డిసెంబర్ ప్రజా పాలన : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించామని వైఎస్సార్ టిపి జిల్లా అధికార ప్రతినిధి కావలి వసంత్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్ర మున్సిపల్ పరిధిలోని ఎన్నో పల్లిలో వైఎస్ఆర్ టిడిపి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని శుభాభివందనాలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ టిపి జిల్లా అధికార ప్రతినిధి వసంత్ కుమార్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ పాలనకు చరమగీతం పాడాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. వికారాబాద్ నియోజకవర్గంలో వైఎస్సార్ పిపి జెండా ఎగురవేసే సమయం ఆసన్నమైందని తెలిపారు. రాబోవు రోజుల్లో గడపగడపకు వైఎస్సార్ టిపి జెండా రెపరెపలాడనున్నదని విశ్వాసం వ్యక్తం చేశారు.
Share this on your social network: