ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

Published: Saturday September 24, 2022
మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో 23 సెప్టెంబర్ ప్రజాపాలన : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపామని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని ధన్నారం గ్రామ సమీపంలో ఉన్న యజ్ఞ పాఠశాల విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్సీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి రాజకీయంగా ఎదుగుతూ మరెన్నో ఉన్నత పదవులను అధిష్టించాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలే పరిష్కారం చేసే దిశగా కృషి చేసే జననేత ఎమ్మెల్సీ అని కొనియాడారు. ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజాసేవే పరమావధిగా భావించి ముందుకు వెళ్తున్నారని స్పష్టం చేశారు. చైర్ పర్సన్ తో పాటు వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం, కౌన్సిలర్లు మాలె గాయత్రి లక్ష్మణ్, మోముల స్వాతి రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.