డ్రై డే కార్యక్రమం
Published: Thursday September 16, 2021
బోనకల్లు, సెప్టెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామంలో దోమల నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతూ దోమలు నియంత్రించేందుకు గ్రామంలో అన్ని వేళల సర్పంచ్ మర్రి తిరుపతిరావు ఆధ్వర్యంలో గ్రామంలో నీటి మడుగులు డ్రైనేజీల లో తేమ ప్రదేశాలలో పగటిపూట నీటి పై వాలి దోమలను గుడ్లు పెట్టకుండా ట్రాక్టర్ ద్వారా తీమేపాసు మందు నుపిచికారి చేసి దోమల అరికట్టేందుకు నివారణ చర్యలు డెంగ్యూ మలేరియా వ్యాధి రాకుండా నియంత్రించేందుకు గ్రామ ప్రజలకు దోమలుఎటువంటి హాని చేయకుండా చూసుకోవాలని గ్రామ ప్రజలకు సర్పంచ్ మర్రి తిరుపతిరావు కోరడమైనది. గ్రామంలో పాత టైర్లు గాబులలో నీటి నిల్వలు లేకుండా డ్రై డే ఫ్రైడే కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తూ ఆశా కార్యకర్తలు కళావతి రత్నకుమారి అంగన్వాడీ టీచర్లు పద్మ హుస్సేన్ బీ గౌరమ్మ పంచాయతీ కార్యదర్శి పరుశురాం డెంగ్యూ నివారణ కార్యకర్త గుగులోతు వెంకటేశ్వర్లు పంచాయతీ సీబ్బంది నాగరాజు మల్టీపర్పస్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: