ఎర్రుపాలెం లో టిఆర్ఎస్ సత్తా ఏంటో పార్టీ సభ్యత్వా నమోదు ద్వారా చూపించాలి

Published: Wednesday February 17, 2021
మధిర, ఫిబ్రవరి 15, ప్రజాపాలన: జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు ఘనంగా ఎరుపాలెం మండల కేంద్రం లో గల దూపుకుంట్ల కల్యాణ మండపంలో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం ఈసందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ ఎర్రుపాలెం మండలంలో విస్తృతస్థాయిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషిచేయాలని ఈ సభ్యత్వ నమోదు తో ఏర్రుపాలేం టిఆర్ఎస్ పార్టీ సత్తా చూపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ కవిత,డిసిసిబి డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ, ఎర్రుపాలెం సర్పంచ్ మొగిలి అప్పారావు, మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ వెంకట్ రామ్ రెడ్డి, రైతు బంధు జిల్లా కమిటీ సభ్యులు వేమిరెడ్డి త్రివేణి, మహిళా అధ్యక్షురాలు ఉమా మహేశ్వరి, మండల కార్యదర్శి నారాయణ, సర్పంచులు ఎంపీటీసీలు డి సి సి బి అధ్యక్షులు డైరెక్టర్లు, టిఆర్ఎస్ గ్రామ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.