డాక్టర్ చిక్కుడు గుండాలుకు సన్మానo
Published: Tuesday November 16, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి : సోమవారం రోజు మన కొత్తపల్లి గ్రామానికి చెందిన రంగారెడ్డి జిల్లా మాల మహానాడు అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు గుండాలు నేషనల్ పీస్ యూనివర్సిటీ ఆఫ్ జర్మనీ ద్వారా డాక్టరేట్ పొందిన సందర్భంగా యాచారం మండలం లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది తదనంతరం డాక్టర్ చిక్కుడు గుండాలు గారిని పలువురు నాయకులు శాలువతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మొండి గౌరెల్లి సర్పంచ్ బండి మీద కృష్ణ సిపిఎం నాయకులు బ్రహ్మయ్య కొత్తపల్లి నాయకులు ఎండి రనీ బాలయ్య వెంకటయ్య జగన్ మరియు యువకులు పాల్గొనడం జరిగింది
Share this on your social network: