గణతంత్ర దినోత్సవ వేడుకలలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

Published: Friday January 27, 2023
వికారాబాద్ బ్యూరో 26 జనవరి ప్రజా పాలన : 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహణ చేశారు. గురువారం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ ఆటపాటలతో ప్రేక్షకుల మనసులను రంజింప చేశారు. దేశ స్వాతంత్రం కోసం చేసిన పోరాటాల సన్నివేశాలను ప్రదర్శించి రోమాలు నిక్కపరిచే విధంగా నృత్యం చేశారు. ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క దేశభక్తి గీతాలకు అనుకూలంగా విద్యార్థుల నృత్యం ఆకట్టుకుంది. సంఘం లక్ష్మీబాయి విద్యార్థుల నృత్యం 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలకే ఆదర్శంగా నిలవడం విశేషం. బొమ్రాస్పేట్ గిరిజన విద్యార్థులు తమ సామాజిక గేయంతో విద్యార్థుల నృత్యం కనురెప్పలు వాల్చనియలేదు.