ఓటర్ ఐడికి ఆధార్ అనుసంధానం తప్పని సరి. స్వయంగా బైకుపై గ్రామాల్లో తిరుగుతు ప్రజలకి తెలియజేస్

Published: Thursday October 27, 2022

బూర్గంపాడు ( ప్రజా పాలన.)
భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్ మండల పరిధిలో గల పలు గ్రామాల్లో స్వయంగా తహసిల్దార్ భగవాన్ రెడ్డి తిరుగుతు....ఓటర్ ఐడికి ఆధార్ అనుసంధానం తప్పని సరి ప్రజలకి తెలియజేస్తున్నారు. ఓటర్ ఐడికీ ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే మీ విలువైన ఓటు కోల్పోవడమే కాక జనాభా లెక్కలలో మీ పేర్లు నమోదు కావని రేషన్ బియ్యం మరియు పలు ప్రభుత్వ పథకాలకు అర్హులు కారనీ కావునా ఆధార్ లింక్ చేయించుకోని వారు చేయించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వారితో పాటు ఆర్ ఐ  అక్బర్,  వీఆర్ఏ లు ముత్యం,శ్రీను,నాగేశ్వరావు మరియు సారపాకలో ప్రత్యేక రెవెన్యు బృందం ఉన్నారు.