ప్రధానమంత్రి విశ్వకర్మ స్వాబిమన్ పథకాన్ని స్వాగతిస్తూ ప్రధాన మంత్రి మోదీ చిత్రపటానికి పాల
కోరుట్ల, ఫిబ్రవరి 03 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పార్లమెంటు బడ్జెట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చేతుల మీదుగా ప్రధానమంత్రి విశ్వకర్మ స్వాబిమన్ పేరుతో చేతి వృత్తిదారులకు ఒక ఆర్థిక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రకటించిన సందర్భంగా విశ్వకర్మలు ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విశ్వకర్మ నాయకులు మాట్లాడుతూ చేతి వృత్తిదారులు ఆర్థికంగా ఎదుగుదలకు ప్రధానమంత్రి విశ్వకర్మ స్వాబిమన్ పథకం ఉపయోగపడుతుందని ఇంత గొప్ప పథకాన్ని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం అధ్యక్షులు శ్రీపాద ప్రకాష్,ముమ్మడిఆంజనేయులు, వంశీ, రాజ మోహన చారి, శ్రీనివాస్, రవి మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Share this on your social network: