మాలమహానాడు కోరుట్ల డివిజన్ కమిటీ అధ్యక్షుడి ఎన్నిక

Published: Thursday July 08, 2021
కోరుట్ల, జూలై 07 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో జగిత్యాల లోని ప్రెస్ క్లబ్ లో కోరుట్ల డివిజన్ కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. కోరుట్ల డివిజన్ మాల మహానాడు అధ్యక్షునిగా పుప్పాల గంగారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని జిల్లా అధ్యక్షులు యాదాద్రి శ్రీహరి తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా మీడియా ఇంచార్జ్ నీరటి గంగాధర్, జగిత్యాల మాలమహానాడు పట్టణ అధ్యక్షులు కమలాకర్, ఉపాధ్యక్షుడు నర్ర శంకర్, జిల్లా కోశాధికారి కంటే అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకుంట గంగాధర్ మరియు జిల్లా మాలమహానాడు సభ్యులు పాల్గొన్నారు.