సీడ్స్ పెస్టిసైడ్స్ పర్టిలైజర్ షాపులలో తనిఖీలు

Published: Friday June 04, 2021
బీరుపూర్, జూన్ 03 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండలంలోని నర్సింహులపల్లి తుంగూర్ కోల్వాయి తదితర గ్రామాల్లో పెస్టిసైడ్స్ సీడ్స్ పర్టీలైజర్ షాపులలో బీరుపూర్ ఎస్ఐ అనిల్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారిణి అనూష తనిఖీలు నిర్వహించారు. విత్తనాల నిల్వలు స్టాక్ రిజిస్ట్రార్ షాప్ లైసెన్స్ బిల్లు బుక్స్ విత్తనాల పరిశీలన అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు. ఏఓ మాట్లాడుతూ షాపుల యజమానులు నాసిరకం విత్తనాలు అమ్మితే లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు. ఎస్ఐ మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతి ఉన్న విత్తనాలను మాత్రమే అమ్మలని రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకోని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.