ఎస్ఎఫ్ఐ నూతన కమిటీ ని ఎన్నుకోవడం -ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షులు బ్యాగరి అరుణ్ కుమార్

Published: Thursday November 03, 2022
 చేవెళ్ల నియోజకవర్గం (బ్యూరో) ప్రజా పాలన 
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని శంకర్పల్లి మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ  నూతన కమిటీ లు వేయడం జరిగింది. వివిధ కాలేజీల అధ్యక్షులను ఎన్నుకున్నారు. వాసవి కాలేజ్ అధ్యక్షులు కార్యదర్శి నవీన్.రాహుల్, గర్ల్స్ కన్వీనర్ భాగ్యలక్ష్మి. స్వప్నను ఎన్నుకున్నారు. జాగృతి డిగ్రీ కాలేజ్ కమిటీ అధ్యక్షులు కార్యదర్శి  ప్రేమ్ సాయి, హరి గర్ల్స్ కన్వీనర్ లావణ్య,ప్రవళిక,ప్రత్యక్ష,
 వివేకానంద కాలేజ్ అధ్యక్షులు కార్యదర్శి శివ,మధు, గర్ల్స్ స్వాతి,పద్మప్రియ,ఎన్ను కున్న తర్వాత ప్రతి ఒక్క అధ్యక్షులు చెప్పిన ఒకే ఒక విషయం తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతుందని అన్నారు. చేవెళ్ల డివిజన్ లో బస్సుల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయని ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి విద్యార్థులు  కళాశాలలకు, పాఠశాలకు సమయానికి అనుకూలంగా నడపాలని లేకుంటే వేల మంది విద్యార్థులతో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రహదారుల దీర్బందం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రాజేందర్. శ్రీకాంత్. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.