*పట్టణంలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవం*

Published: Friday January 27, 2023
లక్షటిపేట్ , జనవరి26, ప్రజాపాలన:
 
  పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ,ప్రయివేట్ పాఠశాలల్లో ,  కళాశాలలో, కులసంగాలు ,స్థానిక  రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో  74వ గణతంత్ర వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తసీల్ధార్ కార్యక్రమంలో నాయబ్ తసీల్ధార్ సనత్ కుమార్ , మండల పరిసెట్ కార్యాలయంలో   ఎంపిపి అన్నం మంగ చిన్నన్న , మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఆకుల వెంకటేష్,  కోర్టులో న్యాయమూర్తి మహమ్మద్ అసదుల్లా శరిఫ్,  పోలీస్టేషన్ లో సిఐ కరిముల్లాఖాన్, అంబెడ్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం మండలాధ్యక్షులు దొంత నర్సయ్యలు  త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. అన్ని ప్రభుత్వ ప్రయివేట్  పాఠశాల పిల్లలు విదులలో ర్యాలీలు తీసి జెండా ఆవిష్కరించి, పిల్లలతో నృత్యాల ప్రదర్శన చేశారు.  పిల్లలు చేసిన నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో అధికారులు అదికారులు పిల్లలు రాజకీయ నాయకులు కులసంఘాల నాయకులు పాల్గొన్నారు.