పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సండ్ర..

Published: Thursday April 21, 2022
ప్రత్యేక పూజలు చేసిన సేవెల్లి సంపత్ కుమార్..
తల్లాడ, ఏప్రిల్ 20 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని అన్నారుగుడెంలో అంకమ్మతల్లికి చివరిరోజు బుధవారం సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య పట్టువస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా కొమరవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సెవెల్లి సంపత్ కుమార్, కృష్ణవేణి దంపతులు అన్నదానానికి విరాళం అందించారు. ఈ నేపథ్యంలో వారు కూడా హాజరై ఎమ్మెల్యేతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్, తల్లాడ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చివరిరోజు అంకమ్మ జాతర కన్నుల పండుగగా వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు రెడ్డం వీరమోహన్ రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు దుగ్గిదేవర వెంకటలాల్, వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ధూపాటి భద్ర రాజు, శీలం.కోటరెడ్డి, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు ధూపాటి నరేష్ రాజు, సర్పంచులు శీలం కోటారెడ్డి, జొన్నలగడ్డ కిరణ్ బాబు, కోసూరి నరసింహారావు, తూము శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.