ఆస్తిపన్ను పై 90 శాతం బకాయి వడ్డీ మాఫీ: మున్సిపల్ కమిషనర్

Published: Friday March 05, 2021

మధిర, మార్చి 4, ప్రజాపాలన ప్రతినిధి: మధిర మున్సిపాలిటీలో పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయి వడ్డీనీ 90% మాఫీతో కేవలం 10 శాతం వడ్డీతో మాత్రమే చెల్లించేందుకు చివరిసారి అవకాశం కల్పించినట్లు గురువారం మున్సిపల్ కమిషనర్ శ్రీమతి A.రమదేవి గారు తెలిపారు. పట్టణంలో పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయి చెల్లింపుదారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వన్ టైమ్ స్కీమ్ క్రింద ఆస్తిపన్నుపై 90% పేరుకుపోయిన బకాయి వడ్డీని మాఫీ చేసిందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని గృహ, వాణిజ్య వినియోగదారులు వినియోగించుకోవాలని కమిష్ నర్ కోరారు.