డోర్నకల్‌-మిర్యాలగూడ రైల్వే లైన్‌ మార్పు నేలకొండపల్లి కోదాడ మీదుగా కొత్త లైన్

Published: Friday March 19, 2021
పాలేరు (ప్రజాపాలన ప్రతినిధి) మార్చి 18 మిర్యాలగూడ కొత్త రైల్వే లైన్‌ అలైన్‌మెంట్‌ను మార్చామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బుధవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆపరేషనల్‌, వాణిజ్యపరమైన అవసరాల రీత్యా లైన్‌ అలైన్‌మెంట్‌ను నెలకొండపల్లి, కోదాడ, హుజూర్‌నగర్‌, నేరేడుచెర్ల మీదుగా మార్చామని, సర్వే చేపడుతున్నామని చెప్పారు.