ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 20 ప్రజాపాలన ప్రతినిధి **కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పైన ప్
Published: Tuesday February 21, 2023
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల సమస్యలకు సంబందించిన అర్జీలను అదనపు కలెక్టర్ తిరుపతి రావు జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియతో కలిసి స్వీకరించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ అంశాలపై 65 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Share this on your social network: