టిఆర్ఎస్ పార్టీ భారత్ రాష్ట్ర సమితి గా మారినందున కొడిమ్యాల లో సంబరాలు

Published: Friday October 07, 2022

కొడిమ్యాల, అక్టోబర్ 05 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు తెరాస పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని  భారత్ రాష్ట్ర సమితి గా  ఏకగ్రీవ తీర్మానం చేసినందున
చొప్పదండి , ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపు మేరకు.
కొడిమ్యాల మండల కేంద్రంలో అంగడి బజార్ లో బుధవారం రోజున టిఆర్ఎస్ పార్టీ కొడిమ్యాల మండల శాఖ అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్,పాక్స్ చైర్మన్ మేన్నేని రాజనర్సింగారావు  ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆనాడు నీళ్లు నిధులు నియమాకలు అనే టాగ్ లైన్ తో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు టిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రివర్యులు  తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ రాష్ట్రంలో ఉన్న అనేక సంక్షేమపథకాలు , అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు ఇలాంటి సంక్షేమ పథకాలు కార్యక్రమాలు మాకు ఉండాలని ఇతర రాష్ట్రాల ప్రజలు మెచ్చి ఆకర్షితులు కావడంతో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల పక్షాన పోరాటం చేసుటకై కేసీఆర్  తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తూ సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, ఎంపీటీసీ సామల లక్ష్మణ్,  తదితరులు పాల్గొన్నారు.