గుడ్న్యూస్ విద్యార్థులు ప్రతిభ..
Published: Thursday April 06, 2023
ఏన్కూరు, ఏప్రిల్ 5 (ప్రజా పాలన న్యూస్): జాతీయస్థాయి ఒలంపియాడ్లో టీఎల్పేట గుడ్న్యూస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అమరావతి జాతీయ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ర్టాలకు చెందిన 100 విద్యాసంస్థల బాలలకు గణితం, జనరల్ నాలెడ్జ్, సామన్య, డ్రాయింగ్, చేతిరాత పరీక్షలు నిర్వహించారు. 10వేల మంది విద్యార్థులు పోటీలో పాల్గొనగా 109 మంది ప్రతిభ గలవారిని గుర్తించారు. వారిలో గుడ్న్యూస్ బాలికలు జీకే, సామాన్య కేటగిరీల్లో నాలుగు బహుమతులు లభించాయి. విద్యార్థులతోపాటు ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ బ్రిటోను నిర్వాహకులు ప్రశంసాపత్రం, జ్ఙాపికలు అందించారు. పోటీలో రాణించిన బాలికలను కరస్పాండెట్ సిస్టర్ నిజావర అభినందించారు.
Share this on your social network: