చిలుకూరు పాఠశాలను సందర్శించిన డీఈఓ యాదయ్య మధిర రూరల్

Published: Thursday August 25, 2022

 ఆగస్టు 24 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో బుధవారం నాడు.చిలుకూరు ప్రభుత్వ పాఠశాలను ఈరోజు డీఈఓ యాదయ్య ఎంఈఓ వై ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా డిఇఓ పాఠశాల పిల్లలతో మాట్లాడి పాఠ్య పుస్తకాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఏ విధంగా అందుతుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడగగా వారు సమాధానాలు  చెప్పిన తీరును అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈవో సిసి మాధవరావు ప్రధానోపాధ్యాయులు శంకర్రావు, ఉపాధ్యాయులు రాధాకృష్ణ పాల్గొన్నారు.