మునుగోడులో టీఆర్ఎస్ గెలుపుతో బోడుప్పల్లో కార్పొరేటర్లు సంబరాలు
Published: Monday November 07, 2022
మేడిపల్లి, నవంబర్ 6 (ప్రజాపాలన ప్రతినిధి)
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
11,666వేల ఓట్లతో ఘనమైన మెజార్టీని సాధించి గెలుపొందిన సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు బొమ్మక్ సుగుణ బాలయ్య, దొంతరబోయిన మహేశ్వరి కృపసాగర్ ముదిరాజ్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వెల్లంకి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this on your social network: