ఘనంగా బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్
Published: Tuesday August 10, 2021
గుమ్మడిదల, ఆగష్టు 09, ప్రజాపాలన ప్రతినిధి : మండలం అన్నారం గ్రామంలో బోనాల పండుగ వేడుకలను గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గంగు రమేష్, ఎంపీటీసీలు నాగేందర్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, ఉప సర్పంచ్ మురళి, పార్టీ మండల ప్రెసిడెంట్ వీరారెడ్డి కాంగ్రెస్ నాయకులు జయ శంకర్ గౌడ్ శ్రీకాంత్ రెడ్డి, నర్సింగ్రావు, ప్రతాప్ రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: