మున్సిపాలిటీ పరిధిలోపారిశుధ్యంపై 4వార్డు స్పెషల్ డ్రైవ్
Published: Saturday November 26, 2022
మధిర నవంబర్ 25 (ప్రజా పాలన ప్రతినిధి) మధిర మున్సిపాలిటీ పరిధిలోని 23వార్డుల్లో రోజుకు ఒక వార్డులో పారిశుధ్యం పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతా జయాకర్, కమీషనర్ అంబటి రమాదేవి తెలిపారు. దీనిలో భాగముగా శుక్రవారం నాడు 4వ వార్డులో పర్యటించి పారిశుధ్యం, తడి చెత్త, పొడి చెత్త, వీధి దీపాలు, మంచినీటి సరఫరా తదితర విభాగాల పని తీరుపై వార్డు లోని ఇంటింటికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు. తడి చెత్త-పొడి చెత్త వేరు చేయుటపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 4 వార్డు కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ మొండితోక లత జయకర్, మున్సిపల్ మేనేజర్ రవీందర్ అరె, రాము తిరుపతి వార్డ్ ఇంచార్జ్ లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: