పాఠశాలలో మొక్కలు నాటిన అధికారులు...

Published: Thursday July 08, 2021
బీరుపూర్, జులై 07 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండలం రేకులపల్లి గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి ఎంఈఓ భీమయ్య సర్పంచ్ ఎలగందుల లక్ష్మిఅశోక్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీకాంత్ ఎస్ఎంసి చైర్మన్ మానస ఉపసర్పంచ్ రమేష్ పంచాయతీ సెక్రెటరీ ఆరె రాణి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.