రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు

Published: Tuesday June 08, 2021
- చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : చందానగర్ డివిజన్ పరిధిలోని పిజెఆర్ స్టేడియంలో సుపర్ స్పైడర్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుపర్ స్పైడర్ వాక్సినేషన్ పక్రియను అర్హులైన ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతేకాకుండా ప్రజలు వాక్సినేషన్ సేంటర్ లో అధికారులకు సహకరించాలని సూచించారు. ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ వాక్సిన్ వేయడం జరుగుతుందని తెలిపారు. కోంతమంది వాక్సిన్ వేసుకోవడానికి భయపడుతున్నరని, ఎలాంటి భయం లేకుండా వాక్సిన్ వేసుకోవలన్నారు....ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు ధనలక్ష్మి, ఓ.వేంకటేష్, రవిందర్ రెడ్డి, నరేందర్ భల్లా, భవాని, చందానగర్ డాక్టర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.