సాయి కృష్ణ కాలనీ సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ కు వినతి

Published: Tuesday October 11, 2022
మేడిపల్లి, అక్టోబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్లోని సాయి కృష్ణ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావుకు వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా కాలనీలో 1వ లైను మరియు 3వ లైన్ లో కొత్తగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేయించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. స్పందించిన కార్పొరేటర్ సాధ్యమైనంత తొందరగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రపోజల్ పెట్టించి కొత్తగా లైన్ వేయిస్తానని హామీ ఇచ్చారు.
 
 
 
Attachments area