సిసి రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ అలేఖ్య, జడ్పిటిసి ప్రమీల..

Published: Saturday April 01, 2023
తల్లాడ, మార్చి 31 (ప్రజా పాలన న్యూస్): 
 
మండల పరిధిలోని కేశవపురం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ లో మంజూరైన సిసి రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ వనిగండ్ల అలేఖ్య అశోక్, మండల జడ్పిటిసి దిరిశాల ప్రమీల దాసురావు శుక్రవారం ప్రారంభించారు.సిసి రోడ్డు మంజూరు చేయించినా సందర్భంగా గ్రామ ప్రజలు సర్పంచ్ వనిగండ్ల అలేఖ్య అశోక్,జడ్పిటిసి దిరిశాల ప్రమీల దాసురావు కు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం సర్పంచ్ అలైఖ్య మాట్లాడుతూ ఎనిమిది లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని,గ్రామంలో పలు అభివృద్ధి పనులకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య కు,మండల ప్రజా ప్రతినిధులకు,అధికారులకు గ్రామ పంచాయతీ తరుపున,ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూన్నట్లు తెలిపారు.కార్యక్రమంలో పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ అశోక్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,
దిరిశాల దాసురావు,
బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వనిగండ్ల వెంకటేశ్వరరావు,
గ్రామ పెద్దలు చావా నాగేశ్వరరావు,కట్టా బుచ్చయ్య,కట్టా రామారావు,చెన్నoశెట్టి శ్రీనివాసరావు,పంచాయతీ సిబ్బంది మాగంటి,దేవదానం తదితరులు పాల్గొన్నారు.