ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందచేత

Published: Monday May 31, 2021
కోరుట్ల, మే 30 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలం లోని మాదాపూర్ గ్రామానికి చెందిన ఇల్లెందుల మురళి అనారోగ్యానికి గురి అయిన కారణంగా కోరుట్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కృషితో ముఖ్యమంత్రి  సహాయ నిది నుండి వారికి 60,000/- వేల రూపాయలను వారి వైద్య ఖర్చుల నిమిత్తము అందజేశారు. ఈ సందర్బంగా వారి వైద్యానికి సకాలంలో డబ్బు అందించి వారి ప్రాణాలను కాపాడటానికి కృషి చేసిన కోరుట్ల మండల తెరాస పార్టీ మండల అధ్యక్షులు మరియు మాదాపూర్ గ్రామ సర్పంచ్ దారిషెట్టి రాజేష్, ఎంపీటీసీ చేపురి కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ గడ్డం మల్లారెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.