క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి
Published: Wednesday December 28, 2022
మధిర డిసెంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని మానసిక ఉల్లాసానికి దోహత పడతాయని టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ పేర్కొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో యూత్ ఆధ్వర్యంలో తెలుగు రెండు రాష్ట్రాల స్థాయిలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్ పోటీలను రెండు రాష్ట్రాల స్థాయిలో ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలన్నారు. క్రీడలు మతసామరస్యాన్ని కాపాడతాయని, మానసిక ఉల్లాసానికి దోహత పడతాయని, ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఇక్బాల్, కొఠారి రాఘవ జే.వి.రెడ్డి, ప్యారి, జల్లేపల్లి బాబురావు, గద్దల రాజా వేల్పుల శివ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: