జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః

Published: Monday June 21, 2021
మధిర, జూన్ 20, ప్రజాపాలన ప్రతినిధి : వికాస తరంగిణి మధిర శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు రోజు రాత్రి మధిర ప్రభుత్వ ఆసుపత్రి నందు కరోనా పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతున్న పేషెంట్లకు వికాస తరంగిణి కోవిడ్ ఆహారతరంగిణి ఆధ్వర్యంలో శ్రీమాన్ కుంచం రాధాకృష్ణ మరియు ధర్మపత్ని పద్మావతి ( దెందుకూరు) గార్ల ఆర్థిక సహకారంతో భోజనం ప్యాకెట్లు (20) అందజేయడం జరిగిం ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి మధిర శాఖ అధ్యక్షులు కుంచం కృష్ణారావు మరియు కమిటీ సభ్యులు చారుగుండ్ల నరసింహమూర్తి, కోమటీడి శ్రీనివాసరావు, దాచేపల్లి రాము, నంబూరు మురళీకృష్ణ, మహంకాళి రామకృష్ణ తిలక్, కురువెళ్ళ వెంకట పురుషోత్తం రావు (కృష్ణ) చెడే రామకోటేశ్వరరావు, మిట్టపల్లి నాగ, కోన నరసింహారావు,గండేపల్లి గోపాల్ తదితరులు పాల్గొనడం జరిగింది