టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభల్లో జిల్లా నాయకులు

Published: Monday November 28, 2022

ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 27(ప్రజాపాలన, ప్రతినిధి) :  తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ద్వితీయ మహాసభలు హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్ లో నిర్వహించగా ఆసిఫాబాద్ జిల్లా నుండి 40 మంది జర్నలిస్టులు బయలుదేరి వెళ్లారు. ఈ మహాసభల సందర్భంగా ర్యాలీ నిర్వహించిన అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శి మహేష్, రాజశేఖర్, ఉపాధ్యక్షుడు అసిఫ్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు సురేందర్ రావు, సతీష్, కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్, శ్రీనివాస్, కృష్ణమోహన్, యాదగిరి, రవి,బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.