హై-స్పీడ్ రైలు కారిడార్ అభివృద్ధికి ప్రజాభిప్రాయం : జిల్లా కలెక్టర్ నిఖిల

Published: Thursday November 25, 2021
వికారాబాద్ బ్యూరో 24 నవంబర్ ప్రజాపాలన : హైదరాబాద్ నుండి వికారాబాద్ మీదుగా ముంబై వరకు హై-స్పీడ్ రైలు కారిడార్ అభివృద్ధి కొసం ఈనెల 25న (గురువారం) రోజు స్థానిక అంబేద్కర్ భవనములో ఉదయం 11:00 గంటలకు పర్యావరణ మరియు సామాజిక అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిఖిల తెలియజేసినారు. హై - స్పీడ్ రైలు కారిడార్ కొరకు ఏర్పాటు చేసిన ఇట్టి ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లాలోని అన్ని మండలాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేయాలనీ కలెక్టర్ కోరారు.