భారత నాస్తిక సంఘం ఆధ్వర్యంలో స్వాభిమాన వివాహం

Published: Saturday December 17, 2022
తిమ్మాపూర్ డిసెంబర్ 16 ప్రజాపాలన రిపోర్టర్ శంకరపట్నం:


తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఇందిరానగర్ గ్రామంలో శుక్రవారం భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్ ఆధ్వర్యంలో  శ్రీనివాస్ మేఘన ల స్వాభిమాన వివాహాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో బైరి నరేష్ మాట్లాడుతూ సమాజంలో కుల మత ఆంతరాలు  తొలగిపోయి  స్వాభిమానంతో ఇద్దరు వ్యక్తుల ఇష్ట ఇష్టాలతో వివాహాలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కల్వల రామచందర్, సంఖ్య సత్యనారాయణ, సోమిడి భార్గవ్, తదితరులు హాజరయ్యి శుభాకాంక్షలు తెలిపారు.