పోడు భూములను సర్వే చేయాలని తాసిల్దార్ కు వినతి

Published: Wednesday November 09, 2022
జన్నారం నవంబర్ 08, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో  పోడు భూములను సర్వే చేసి సాగు చేయడానికి అనుమతి ఇవ్వాలని చర్లపల్లి, దేవునిగూడ ,పోడుభూమి లబ్ధిదారులు మండల తహసీల్దార్ ఇ కిషన్ కు మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల బీసీ కులానికి చెందిన నిరుపేదలమైన మేము సాగు చేసుకోవడానికి భూమి లేక జీవనాధారం కష్టమవుతుందని తాహశిల్థార్ ను కోరారు. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో మా పేర్లు ఉన్నాయని, పోడు భూములకు సాగు చేసిన లభ్దిదారులకు సంబంధిత సాగు భూమిని, సర్వే చేయించి మాకు సాగు చేసుకోవడానికి అనుమతించాలని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పోడు భూముల లబ్ధిదారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల పోడు భూములు లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.