5 లక్షలకు గణనాథుని లడ్డు కైవసం చేసుకున్న కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు
Published: Tuesday September 21, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 20, ప్రజాపాలన ప్రతినిధి : నాదర్గుల్ గణనాథుని వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులందరు విగ్నేశ్వరుని నవరాత్రులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బిజెపి బడంగ్ పేట కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి గణనాధుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్రమైన లడ్డు వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యుల సమక్షంలో లడ్డు వేలం పాటలో పాల్గొని ఐదు లక్షల రూపాయలకు కైవసం చేసుకున్న బిజెపి కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి. యూత్ సభ్యులందరూ శాలువాతో సన్మానించి లడ్డు ప్రసాదం అందజేశారు. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... వేలంపాటలో ఆ గణనాథుని లడ్డు ప్రసాదం తీసుకోవడవల్ల ఆనందంగా సంతోషంగా ఉందన్నారు. కార్పొరేషన్ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడు ఉండాలని దేవదేవుని వేడుకున్నారు. వెంకట్ రెడ్డి నిర్మల దంపతులు కలిసి మహేశ్వరం నియోజకవర్గానికి 2023 సం..లో రాబోయే ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీతో గెలవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ కు బహుమానంగా అందజేస్తామని చెప్పారు.
Share this on your social network: