ఎంపీ అర్వింద్ పై చేసిన వ్యాఖ్యలు అర్థరహితం

Published: Friday May 28, 2021
జగిత్యాల, మే 27 (ప్రజాపాలన ప్రతినిధి):  జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై చేసిన వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయని జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుంటే కలెక్టర్ రవి కి లారీలు రావట్లేదని ఎమ్మెల్యే లేఖ ఎందుకు రాశారని ప్రశ్నించారు. తప్ప తాలు తరుగు తీస్తున్న విషయం తెలిసి కూడ రైతులకు ఎం ఇబ్బందులు ఎదురవ్వడం లేదని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆరోపించారు. రైతుల వరిధాన్యం కొనుగోలులో జాప్యం జరిగిన కూడ రైతులు రోడ్లు ఎక్కి ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్న కూడ చూసి చూడనట్లు వ్యవహరించడం మీకే సాధ్యమవుతుందని విమర్శించారు. ఎంపీ అర్వింద్ కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించినప్పుడు రైతులు తమ గోడును విన్నవించడంతో కలెక్టర్ రవికి తెలియజేయడం తప్ప అని అడిగారు. సమస్యలను ఎంపీ ప్రభుత్వనికి అధికారుల దృష్టికి తెస్తే ప్రెస్ మీట్ లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం విడ్డురంగా ఉందని సత్యనారాయణ మండిపడ్డారు.